ఇందిరమ్మ కాలనీలో రేషన్ బియ్యం సీజ్

ఇందిరమ్మ కాలనీలో రేషన్ బియ్యం సీజ్

సత్యసాయి: ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని టూటౌన్ SI వీరేష్ సీజ్ చేశారు. అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.