అంబేద్కర్ జయంతి.. సమస్యలపై గ్రామసభలు
కోనసీమ: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు మంగళవారం స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రావులపాడు, ముమ్మిడివరప్పాడు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.