GOOD NEWS చెప్పిన ప్రభుత్వం
AP: ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్న్యూస్ చెప్పింది. అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1,750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డీబీవీ స్వామి తెలిపారు. ఈనెల 25లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18-45 ఏళ్లలోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని మంత్రి వెల్లడించారు.