బద్వేల్లో నీటి సరఫరాకు అంతరాయం
KDP: బద్వేల్ పట్టణంలో చింతపుత్తాయ పల్లె, పంగాలపల్లెకు వెళ్లే తెలుగు గంగ వాటర్ సప్లై పైపులైన్ నేషనల్ హైవే పనుల సమయంలో ధ్వంసం కావడంతో మట్టి చేరి బ్లాక్ అయింది. మంగళవారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సిబ్బందితో కలిసి పైపులైన్ను పరిశీలించారు. ఈ బ్లాక్తో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.