కీసరగుట్టపై స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు
MDCL: కీసరగుట్టలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయంలో నిత్య పూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రతి రోజు అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలతో స్వామివారిని భక్తులు భక్తితో సేవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పూజలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.