'ధర్మ యుద్ధ సభను విజయవంతం చేయాలి'
ADB: ఇంద్రవెల్లిలోని అమర వీరుల స్తూపం వద్ద 'ధర్మ యుద్ధ సభ' విజయవంతం చేయాలని తుడుం దెబ్బ కార్యవర్గ సభ్యులు పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అని ఆదివాసీల ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఈనెల 23న ఉట్నూర్ ఎంపీడీవో గ్రౌండ్లో తలపెట్టిన సభను ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.