రోడ్డు ప్రమాదాల నివారణకై వాహనదారులకు అవగాహన
కృష్ణా: తాడిగడప సెంటర్లో రోడ్డు ప్రమాదాల నివారణకు బుదవారం ఎస్సై ఉషారాణి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం అవసరం గురించి వివరించారు. వేగవంతమైన డ్రైవింగ్, ప్రమాదకరమైన ఓవర్టేకింగ్ వంటి చర్యల వల్ల కలిగే ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేశారు.