శిర్గావ్ తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం

శిర్గావ్ తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం

గోవాలో జరిగిన ఘోర విషాదంపై సీఎం ప్రమోద్ సావంత్ విచారం వ్యక్తం చేశారు. ఆలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించటం బాధాకరమని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కాగా.. శిర్గావ్ లైరాయ్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు.