'ఓట్ల మీద శ్రద్ధ అభివృద్ధిపై లేకపోవడం దురదృష్టకరం'

KDP: గత కొన్ని నెలలుగా స్థానిక పంచాయతీ పరిధిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, దీనిపై అధికార టీడీపీ నాయకులకు ఓట్లపై ఉన్న శ్రద్ధ, అభివృద్ధిపై లేకపోవడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వేంపల్లి ఎంపీడీవో కుళాయమ్మని కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఇప్పటికైనా సమస్యలపై స్పందించాలన్నారు.