బాధితురాలి ఇంటికి వెళ్లి FIR నమోదు
NRPT: ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం పోలీస్ శాఖ బాధ్యత అని ధన్వాడ ఎస్సై వెంకటేష్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఎంనోన్పల్లి గ్రామానికి చెందిన మహిళ ఫిర్యాదుపై, పోలీసులు ఆమె ఇంటికే వెళ్లి FIR నమోదు చేశారు. భర్త, అత్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై తెలిపారు.