ప్రజలతో మమేకమవుతూ కేంద్రమంత్రి ప్రచారం
HYD: జూబ్లీహిల్స్లో BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బోరబండ డివిజన్, ఎర్రగడ్డ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి మోసాలను ప్రజలకు వివరించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి BJPని గెలిపించాలన్నారు.