తప్పిపోయిన 27 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు
MDK: జాతరలో తప్పిపోయిన బాలుడు 27 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరిన ఘటన రేగోడ్ మండలం పెద్దతండాలో వెలుగుచూసింది. దేవులీబాయి-రూప్సింగ్ కుమారుడు రవీందర్నాయక్ 3ఏళ్ల వయసులో అల్లాదుర్గ్ జాతరలో తప్పిపోయాడు. తప్పిపోయిన అతడిని పిల్లలు లేని మరో జంట అక్కున చేర్చుకుని ఇతర రాష్ట్రంలో పెంచింది. అసలు విషయం తెలియడంతో శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు.