'అమ్మకు మించిన దైవం లేదు'
సంగారెడ్డి: జహీరాబాద్ అమ్మకు మించిన దైవం లేదని, తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యమని మహామండలేశ్వర్ శ్రీ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. యువత మంచి మార్గంలో నడుస్తూ పెద్దలు చూపిన దారిలో సాగాలన్నారు. కుటుంబ విలువలను కాపాడితే సమాజం సుభిక్షంగా ఉంటుందని సూచించారు.