'పశు పోషణ కూడా వ్యవసాయమే'

'పశు పోషణ కూడా వ్యవసాయమే'

ASR: పాడేరు మండలం సుకూరుపుట్టు, డి.గొందూరు గ్రామాల్లో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశు సంరక్షణ వ్యవసాయానికి అనుబంధమైందని, పశుసంపద రైతుకు ముఖ్య ఆధారమని తెలిపారు.