ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీలో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని స్కూల్స్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ను ఆపేయాలని 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించే స్పోర్ట్స్ మీట్ ఆపేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, వాయు కాలుష్యంతో విద్యార్థులు, ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే.