గుడ్, బ్యాడ్ టచ్పై విద్యార్థులకు అవగాహన
కృష్ణా: మోపిదేవిలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి ఎస్సై గౌతమ్ కుమార్ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.