బీరవెల్లిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పన

బీరవెల్లిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పన

NRML: తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో సోమవారం, సైబర్ నేరాలపై బ్యాంకు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంచార వాహనం ఏర్పాటు చేసి, నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు, సైబర్ నేరాలపై అప్రమత్తత, బ్యాంకింగ్ వ్యవస్థతో ముడిపడి ఉన్న వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.