VIDEO: 'ఈనెల 15 అర్ధరాత్రి నుంచే చేపల వేట నిషేధం'
VSP: సముద్ర మత్స్య సంపద పునరుత్పత్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా విధించే వేట నిషేధం ఈనెల 15 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. జూన్ 16 వరకు అంటే 61 రోజుల పాటు తూర్పు తీర రాష్ట్రాల్లో మెకనైజ్డ్ బోట్ల వేటపై ఆంక్షలు ఉంటాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లోని సుమారు 700 మరపడవలు నేటితో జెట్టీలకే పరిమితం కానున్నాయి.