తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్
KMR: పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతినగర్ 3వ వార్డులో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ తక్షణమే స్పందించారు. ప్రజల ఇబ్బందులను గమనించి వెంటనే కొత్త బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించారు. సర్పంచ్ చూపిన ఈ సమయస్ఫూర్తిని, సేవా దృక్పథాన్ని స్థానిక గ్రామస్థులు హర్షిస్తూ, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.