గ్రంథాలయాల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయాల స్థితిగతులు, బకాయిల పరిష్కారం కోసం ఛైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను మంగళవారం కలిశారు. గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ భవనాల్లో ఉన్న గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు, డిజిటల్ సదుపాయాలు కల్పించాలని కోరారు.