VIDEO: అందరూ దోచుకుంటారని కేటీఆర్ భ్రమిస్తున్నారు: ఎంపీ
HYD: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీమంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిందని అన్నారు. తాము దోచుకున్నట్లే అందరూ దోచుకుంటారని కేటీఆర్ భ్రమిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో అందరూ నాయకులేనని, శిక్షణా తరగతులతో పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.