వెటర్నరీ మరణాలపై డోన్లో నిరసన
NDL: డోన్ పట్టణంలో వెటర్నరీ డాక్టర్ల దుర్మరణాలపై పశుసంవర్ధక శాఖ సిబ్బంది భారీ నిరసన ర్యాలీ సోమవారం నిర్వహించారు. శివమొగ్గ, జామ్నగర్ ఘటనల్లో మృతి చెందిన డాక్టర్లకు నివాళి అర్పించారు. భద్రతా లోపాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు న్యాయం, పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.