కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు: కేంద్రమంత్రి

కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు: కేంద్రమంత్రి

సినీ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేతలే కర్ణాటక మంత్రి పరమేశ్వరపై ఈడీకి ఫిర్యాదు చేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అంతర్గత కలహాలతో ఈడీని సంప్రదించినట్లు చెప్పారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఈడీకి లేఖలు రాస్తున్నదెవరో చెప్పాలని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలే పరమేశ్వరకు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చి, ఇప్పుడు నాటకమాడుతున్నారని విమర్శించారు.