సాయి బాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయిబాబా దేవస్థానం మాధవ్ నగర్ బర్దిపూర్లో దత్త జయంతి పురస్కరించుకుని గురువారం రోజున స్వామి వారి డోలారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో రవీందర్ వెల్లడించారు. తదుపరి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు పాల్గొన్నారు.