రేపు మేడారం రానున్న నలుగురు రాష్ట్ర మంత్రులు
MLG: మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్, కొండా సురేఖ బుధవారం మేడారం రానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుంటారు. మహాజాతర ఏర్పాట్లలో భాగంగా జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12గం.కు అధికారులతో సమీక్ష జరుపుతారు. 2గం.కు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమవుతారు.