భారత్‌లో గూగుల్ ఏఐ ప్లస్ సేవలు!

భారత్‌లో గూగుల్ ఏఐ ప్లస్ సేవలు!

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ‘ఏఐ ప్లస్‌’ సేవలు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. దీని నెలవారీ చందాను రూ.399గా ప్రకటించింది. కొత్తగా వచ్చిన చందాదారులు తొలి ఆరు నెలల పాటు ఈ సేవలను రూ.199కే ఆనందించొచ్చని తెలిపింది. ఈ ప్లాన్‌ ద్వారా గూగుల్‌ లేటెస్ట్‌ ఏఐ మోడళ్లను, ఫీచర్లను తక్కువ ధరకే పొందొచ్చని గూగుల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.