VIDEO: చీకట్లో RTC బస్టాండ్.. ప్రయాణికుల ఇక్కట్లు
MHBD: మరిపెడ పట్టణంలోని RTC బస్టాండ్లో శనివారం రాత్రి రూ. 38,075 విద్యుత్ బిల్లు పెండింగ్లో ఉండటంతో అధికారులు లైట్లను బంద్ చేయించారు. ఒక్క లైట్ లేక చీకట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ. లక్షల్లో ఆదాయం వస్తున్నా బిల్లు కట్టకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే బిల్లు కట్టి లైట్లు పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.