మౌళిక సదుపాయాలు కల్పించాలని వినతి
శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 నుంచి మే 15 వరకు అమ్మవారి పండుగలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌళిక సదుపాయాలను కల్పించాలని మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ హనుమంతు కూర్మారావుకు ఇవాళ వినతిపత్రం అందజేశారు.