రామాలయంలో చోరీ ఘటన.. పోలీసులకు ఫిర్యాదు
NLR: ఉదయగిరి మండలం అయ్యవారిపల్లె పంచాయతీ దేకూరుపల్లి ఎస్సీ కాలనీలోని కోదండరామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి మెడలోని 2 గ్రాముల బంగారు మంగళసూత్రం, హుండీలోని సుమారు రూ.10 వేల నగదును అపహరించారు. ఈ ఘటనపై కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.