రూ.10,370 కోట్లతో అభివృద్ధి పనులు: చంద్రబాబు
AP: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రూ.10,370 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాంబిల్లిలో సోలార్ ఇన్ఘాట్ వేఫర్ ఉత్పత్తితో విదేశాలపై ఆధారపడే పరిస్థితి పోతుందని చెప్పారు. ఇది ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ కలల సాకారానికి నిదర్శనమన్నారు. కాకినాడలో గ్రీన్ అమెనియో ఉత్పత్తికి ఏఎం గ్రీన్కో ముందుకొస్తోందని వెల్లడించారు.