హాస్పిటల్ సీజ్..
ATP: రామచంద్ర నగర్లోని లావణ్య హాస్పిటల్ను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుపమ జెంట్స్ తెలిపారు. బుక్కరాయసముద్రంలోని చెదల్లకు చెందిన రాధిక (34) శస్త్ర చికిత్స అనంతరం అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.