అమరావతి పేరుతో ప్రజలకు మోసం: ఎమ్మెల్యే
KRNL: అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విమర్శించారు. ఆదివారం రాంపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రకటించిన అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడంలేదని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.