నాగలక్ష్మి ఆలయంలో చోరీ.. రూ.20 వేల విగ్రహాలు అపహరణ
MLG : ఏటురూనాగారం మండలం ఆకులవారి ఘనపురం గ్రామంలోని నాగలక్ష్మి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసిన తలుపులు పగలకొట్టి లోపల ఉన్న విగ్రహాలు, ఇతర వస్తువులు అపహరించారు. దొంగిలించిన విగ్రహాల విలువ సుమారు రూ. 20 వేలు ఉంటుందని స్థానికులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీ కెమెరా ఫుటేజీ అందజేశారు.