రుణ సమస్యపై న్యాయం కోరుతున్న మహిళలు

రుణ సమస్యపై న్యాయం కోరుతున్న మహిళలు

ASR: కించుమండ గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘ మహిళలు తీసుకున్న రుణం పూర్తిగా తీర్చినట్టు ఉన్నప్పటికీ, బ్యాంకు అధికారులు అప్పు మిగిలి ఉన్నట్లు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఖాతాల్ని నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గత నెల 18న మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు.