ఫిష్ లాండింగ్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం జీ. వేమవరం పంచాయతీ మట్లపాలెంలో ఫిష్ లాండింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ ప్రారంభించారు. ఆర్. కేవీ నిధులు కోటి రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఫిషరీస్ జేడీ కృష్ణారావు తదితరులు ఉన్నారు.