ధర్మస్థల కేసులో ముసుగు వ్యక్తి అరెస్ట్

కర్ణాటకలోని ధర్మస్థల వ్యవహారం ఇటీవల జాతీయస్థాయిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో తప్పుడు సమాచారంతో ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన భీమా అనే వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.