నగర పరిధిలో పందులను పోషించేందుకు వీలులేదు

నగర పరిధిలో పందులను పోషించేందుకు వీలులేదు

KRNL: రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వ జీవో సంఖ్య 323 ప్రకారం పందులను నగర పరిధిలో పోషించేందుకు వీల్లేదని, వాటిని నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో పోషించాలని నగరపాలక కమిషనర్ రవీంద్ర బాబు యజమానులకు స్పష్టం చేశారు. శనివారం పందుల పెంపకపుదారులతో KMC సమావేశ మందిరంలో జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.