చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

KMR: చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సుల్తాన్నగర్లో సోమవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన ఘని(30) అనే వ్యక్తి పెట్రోల్ విక్రయిస్తూ జీవిస్తున్నాడు. ఘని తన బైక్పై నిజాంసాగర్లోని పెట్రోల్ పంప్కు వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొని మృతి చెందాడని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు.