జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు

అల్లూరి: జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 2 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 12.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గాలిలో తేమ 75 నుంచి 82 శాతం ఉంటుందన్నారు.