భారత ఆర్మీ చేతికి వందలాది సూసైడ్ డ్రోన్లు
భారత ఆర్మీలో వందలాది ఆత్మాహుతి డ్రోన్లు భాగమయ్యాయి. సూరత్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇన్సైడ్ ఎఫ్పీవీతో రక్షణశాఖ రూ.10 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కేవలం రెండు నెలల్లోనే ఆ కంపెనీ కామికేజ్ డ్రోన్లను అప్పగించింది. ఈ డ్రోన్లు గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. 2.5 కేజీల పేలుడు పదార్థాన్ని తీసుకెళ్లగలవు. 10కి.మీ దూరం ప్రయాణిస్తాయి.