'రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం'
KMR: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. రెండో విడతలో లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.