చమర్తిని సత్కరించిన మాజీ ఎంపీపీ

KDP: రాజంపేట నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా చమర్తి జగన్మోహన్ రాజును అధిష్టానం ప్రకటించడంపై ఆయనకు సిద్ధవటం మండలం గ్రామ శివారులో శుక్రవారం ఒంటిమిట్ట మాజీ ఎంపీపీ బొడ్డే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎంపీపీ మాట్లాడుతూ.. చమర్తి జగన్మోహన్ రాజు పార్టీ కోసం చేసిన సేవలను అధిష్టానం గుర్తించి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్గా ప్రకటించడం హర్షనీయమన్నారు.