వన్యప్రాణులతోనే భవిష్యత్తు: ఎఫ్ఆర్ఓ
MNCL: వన్యప్రాణులు మనిషి భవిష్యత్తుకు ఆధారమని జన్నారం అటవీశాఖ ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని ఎఫ్ఆర్ఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తుకు ఆధారం అడవులు, వన్యప్రాణులే అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు ఉన్నారు.