అమరావతి అగ్ని ప్రమాద ఘటనలో నిందితుడు అతడే..!
GNTR: అమరావతిలో పైపుల దహనం కేసులో మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. సూపర్ వైజర్పై కోపంతో సెక్యూరిటీ గార్డు రాము నిప్పంటించినట్లు సమాచారం. రోజూ 12 గంటల డ్యూటీ, సెలవు ఇవ్వకపోవడంతో రాము కొన్ని రోజులుగా కోపంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే ఎక్కువ మందిని సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారని మంటలు పెట్టినట్లు పోలీసులు విచారణలో తెలిసింది.