గిరిజన విద్యార్థులకే అధిక విద్యావకాశాలు

VZM: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో అందుబాటులో వున్న వివిధ కోర్సుల్లో గిరిజన విద్యార్ధులకే అధికంగా విద్యావకాశాలు కల్పించాల్సి ఉందని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీజీ శంకర్రావు అన్నారు. గాజులరేగలో ఉన్న వర్సిటీని సోమవారం సందర్శించారు. వైస్ ఛాన్సలర్ కట్టమణితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.