కంభంలో దొంగలు హల్ చల్

కంభంలో దొంగలు హల్ చల్

ప్రకాశం: కంభం మండలం నడింపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి సమయంలో రెండు ఇళ్లల్లో దొంగలు చోరీ చేశారు. 10 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి రూ.5 వేలు నగదు ఇళ్లల్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి దొంగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.