రెడ్లకుంట చెరువు తూముల పరిశీలన
WNP: ఘనపూర్ మండలం ఆగారం శివారులోని రెడ్లకుంట చెరువు తూములను శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. EE జాబేర్ అహ్మద్ మాట్లాడుతూ.. త్వరలో చెరువు తూములకు మరమ్మతు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో DE సూర్య, AE లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నేత మున్నూరు జయాకర్ తదితరులు పాల్గొన్నారు.