వామ్మో.. దవాఖానలో కాలం చెల్లిన మందులు..!
HYD: సికింద్రాబాద్లోని రసూల్పురా బస్తీ దవాఖానలో కాలం చెల్లిన మందులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయవాది రామారావు ఇమ్మనేని దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ మానవ హక్కుల కమీషన్(NHRC) విచారణకు ఆదేశించింది.