క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. యువకుడి హత్య

క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. యువకుడి హత్య

విశాఖ: పెద్దగదిలిలో క్రికెట్ ఆడుతుండగా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం డోల అజిత్ (23) అనే యువకుడు మరి కొంతమంది క్రికెట్ ఆడుతుండగా కిషోర్ (26) అనే వ్యక్తితో గొడవ జరిగింది. ఆగ్రహించిన కిషోర్ మ్యాచ్ అయిపోయిన అనంతరం పెద్ద గదిలి జంక్షన్లో అందరూ చూస్తుండగా చాకుతో పొడిచి అజిత్‌ను హత్య చేశాడు.