'25 కేజీలు గంజాయితో ముగ్గురు అరెస్టు'
ASR: డుంబ్రిగూడ కేజీబీవీ స్కూల్ వద్ద శనివారం ఆటోలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగిందని ఎస్సై పాపినాయుడు తెలిపారు. వారి నుండి 25 కేజీల గంజాయి, ఆటో, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వారిలో ఒకరు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు కాగా ఇద్దరు ముంచింగ్పుట్ మండలానికి చెందినవారని ఆయన పేర్కొన్నారు.